News February 25, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: బండి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ బీజేపీనే గెలుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసి CM హడావుడిగా ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతోందని దుయ్యబట్టారు. కులగణన తప్పుగా సాగిందని, 32శాతమే రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు.
Similar News
News September 17, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 17, 2025
చరిత్రాత్మక ఘట్టం.. పార్టీకో పేరు!

TG: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1948, SEP 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చరిత్రాత్మక రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. అటు BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా.. ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే.
News September 17, 2025
మహిళల ఆరోగ్యం కోసం కొత్త కార్యక్రమం

నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మహిళల ఆరోగ్యం కోసం కేంద్రం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ పేరిట హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు పలు వైద్య పరీక్షలు చేస్తారు. PHC మొదలు బోధనా ఆస్పత్రుల వరకు 15 రోజులపాటు ఈ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్లో ప్రారంభించనున్నారు.