News May 3, 2024
అదే జరిగితే బీజేపీకి సింగిల్ డిజిట్ రాదు: వీకే పాండియన్

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా పేరొందిన వీకే పాండియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే సింగిల్ డిజిట్ కూడా ఆ పార్టీకి రాదన్నారు. బీజూ జనతా దళ్(BJD) విజయం భారీగా ఉండనుందని.. ఈ ఎన్నికల్లో తాము క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో జరగనున్నాయి.
Similar News
News December 2, 2025
పిల్లల్ని కనండి.. ఎలాన్ మస్క్ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే మానవ జాతి క్షీణించి.. అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ <<18433631>>People by WTF<<>> పాడ్కాస్ట్లో మస్క్ కీలక విషయాలు పంచుకున్నారు. “నువ్వూ పిల్లలను కనాల్సిందే” అంటూ కామత్కు సూచించారు. మనిషి మనుగడ కోసం సంతానం కొనసాగించాలని స్పష్టం చేశారు.
News December 2, 2025
నడకతో అల్జీమర్స్ను నివారించొచ్చు: వైద్యులు

అల్జీమర్స్ను నడకతో నివారించవచ్చని కొత్త అధ్యయనంలో తేలిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజుకు 3,000–5,000 అడుగులు నడిస్తే మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ల నిర్మాణం నెమ్మదిస్తుందని తేలింది. అల్జీమర్స్కు చికిత్స లేనప్పటికీ, నివారణ సాధ్యమని చెబుతున్నారు. నడక అనేది అత్యంత శక్తిమంతమైన నివారణ మార్గమని, నడక మొదలుపెట్టాలని సూచించారు.
News December 2, 2025
ఈ ఆపిల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

సాధారణ ఆపిల్స్ను ఫ్రిజ్లో ఉంచితే కొన్ని రోజులకే రుచి మారిపోతాయి. అయితే ‘కాస్మిక్ క్రిస్ప్’ అనే ఆపిల్ మాత్రం చల్లని ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. రుచి మారదు. అలాగే దీన్ని కోసిన తర్వాత కూడా ముక్కలు చాలా సేపటి తర్వాతే గోధుమ రంగులోకి మారతాయి. వాషింగ్టన్ స్టేట్ వర్శిటీ 20 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి దీన్ని రూపొందించింది. ఇది ఎరుపు రంగులో తీపి, పులుపుగా, ముక్కకాస్త దృఢంగా ఉంటుంది.


