News June 4, 2024
పంజాబ్లో బీజేపీ ‘సున్నా’

పంజాబ్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 13 స్థానాల్లో ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న AAP 3 స్థానాల్లో గెలుపొందింది. అత్యధికంగా కాంగ్రెస్ 7 చోట్ల జయకేతనాన్ని ఎగురువేసింది. స్వతంత్రులు 2, శిరోమణి అకాళీదల్ ఒక స్థానంలో గెలుపొందాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ జైలులో ఉండి పోటీ చేసిన అమృత్ పాల్(1,97,120)కి రావడం గమనార్హం.
Similar News
News September 7, 2025
పాలలో కొవ్వు శాతం తగ్గడానికి కారణాలు

* గేదె, ఆవు పాలకు మార్కెట్లో మంచి ధర రావాలంటే వాటిలోని కొవ్వు శాతమే కీలకం.
* పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గతుంది.
* అలాగే పశువులను అధిక దూరం నడిపించినప్పుడు, అవి ఎదలో ఉన్నప్పుడు, వ్యాధులకు గురైనప్పుడు కూడా ప్రభావం పడుతుంది.
* అకస్మాత్తుగా మేతను మార్చినప్పుడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి సమంగా ఇవ్వకపోవడం వల్ల కూడా వెన్నశాతం అనుకున్నంత రాదు.
News September 7, 2025
ఉసిరితో కురులు మురిసె

* వర్షాకాలంలో జుట్టు సమస్యలు తగ్గడానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది
* ఎండు ఉసిరి ముక్కలను కొబ్బరి/బాదం నూనెతో తక్కువ మంట మీద వేడిచేసి, చల్లార్చి ఫిల్టర్ చేయాలి.
* ఈ నూనెను వారానికి 2, 3సార్లు తలకు మసాజ్ చేసి తేలికపాటి షాంపూతో స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
* ఉసిరి పొడిని పెరుగు/కొబ్బరిపాలతో పేస్టులా తయారుచేసి కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. 30ని. తర్వాత వాష్ చేసుకుంటే జుట్టు మృదువుగా మారుతుంది.
News September 7, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం ఏపీలోని విజయవాడ, గుంటూరులో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220 ఉండగా, ఇవాళ రూ.240కి విక్రయిస్తున్నారు. అటు హైదరాబాద్, కామారెడ్డిలో రూ.240గా ఉంది. వినాయక నిమజ్జనాలు ముగియడం, ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.