News November 28, 2024
వచ్చే నెలాఖరు నాటికి బీజేపీ కొత్త చీఫ్: కిషన్ రెడ్డి

TG: డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ను ఎన్నుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మోదీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను తిట్టడం ఆపేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News February 3, 2026
US-INDIA ట్రేడ్ డీల్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి: CBN

AP: USతో ట్రేడ్ డీల్ ముగించినందుకు PM మోదీకి CM CBN అభినందనలు తెలిపారు. ‘ఈ డీల్ చరిత్రాత్మకమైనది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి వంటిది. టారిఫ్లను 18%కి తగ్గించడం 2 ప్రజాస్వామ్య దేశాల బంధాన్ని బలోపేతం చేస్తుంది. ప్రపంచ వృద్ధిని కాంక్షించే దార్శనిక చర్య ఇది. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ తన పాత్రను సుస్థిరం చేసుకుంటోంది. APకి, యువత, రైతులకు అపార అవకాశాలు కల్పిస్తుంది’ అని Xలో పేర్కొన్నారు.
News February 3, 2026
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(<
News February 3, 2026
కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.


