News June 3, 2024

భారీ ర్యాలీకి బీజేపీ ప్లాన్!

image

మళ్లీ కమల ప్రభంజనమే అని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంగా ప్రకటించడంతో బీజేపీ గెలుపు సంబరాలకు ప్లాన్ చేస్తోంది. రేపు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం నుంచి బీజేపీ జాతీయ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ర్యాలీలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం గెలుపు ప్రసంగంలో తొలి 100 రోజుల ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

Similar News

News October 10, 2024

ఈ విషయంలో ప్రపంచ దేశాల కంటే భారత్ ఉత్తమం

image

భారత ఆహార వినియోగ విధానాలు ఉత్త‌మ‌మ‌ని WWF లివింగ్ ప్లానెట్ నివేదిక పేర్కొంది. ప్ర‌పంచ దేశాలు ఈ విధానాల‌ను అనుస‌రిస్తే 2050 నాటికి ఆహార ఉత్ప‌త్తి కోసం త‌క్కువ స్థాయిలో భూమి వాతావ‌ర‌ణం దెబ్బతింటుందని పేర్కొంది. త‌ద్వారా ఒక‌టికంటే త‌క్కువ భూభాగంలోనే మాన‌వాళికి అవ‌స‌ర‌మైన ఆహారాన్ని ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ంది. అర్జెంటీనా, AUS, US, బ్రెజిల్ దేశాల ఆహార వినియోగ ప‌ద్ధతుల‌ను నివేదిక ఆక్షేపించింది.

News October 10, 2024

వారంలో రూ.7,500 కోట్ల డ్రగ్స్ సీజ్

image

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కార్యకలాపాలపై స్పెషల్ సెల్ ఉక్కుపాదం మోపుతోంది. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కేజీల కొకైన్‌ను సీజ్ చేసింది. ఇటీవల 560 కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఇవాళ 200 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేసింది.

News October 10, 2024

ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపు రాత్రి 7 గంటలతో ముగియనుంది. షాపులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. అమెరికా నుంచి అత్యధికంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా నిన్నటి వరకు 57 వేల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చింది.