News November 30, 2024
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ నిరసన కార్యక్రమాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై BJP ‘6 అబద్ధాలు 66 మోసాలు’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. నేటి నుంచి DEC 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్లను ప్రదర్శించనుంది. రేపు జిల్లా స్థాయిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. DEC 2, 3న బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల మందితో సభలు నిర్వహించనుంది.
Similar News
News January 5, 2026
జాగ్రత్త..! మళ్లీ పెరిగిన చలి

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఈ నెల 12 వరకు కోల్డ్ వేవ్స్ వీస్తాయని IMD ఇప్పటికే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. చలి నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
News January 5, 2026
వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.
News January 5, 2026
ఇతిహాసాలు క్విజ్ – 118

ఈరోజు ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గ ద్వారం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>


