News September 22, 2024

నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు మృతి

image

AP: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట సమీపంలో నార్పల-అనంతపురం ప్రధాన రహదారిపై అర్ధరాత్రి లారీ, ఇన్నోవా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇటు తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో తెల్లవారుజామున ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

Similar News

News December 6, 2025

iBOMMA కేసు.. BIG TWIST

image

TG: iBOMMA రవి కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇవాళ అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకోలేదు. 3 కేసుల్లో 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు నిన్న అనుమతివ్వగా పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. 3 రోజుల కస్టడీ సరిపోదని, మరింత గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. దీంతో అతను మరిన్ని రోజులు జైలులో గడపాల్సి ఉంటుంది. అలాగే రవి బెయిల్ పిటిషన్‌పైనా కోర్టు ఎల్లుండే వాదనలు విననుంది.

News December 6, 2025

వాస్తుతో తలరాతను మార్చుకోవచ్చా?

image

కార్యసాధన, పట్టుదలతో బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రయత్నానికి ఇంటి వాస్తు కూడా దోహదపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘వాస్తు నియమాలు పాటిస్తే.. పంచభూతాల ఆధారంగా మన ఆలోచనలు, నడవడిక, శక్తి సానుకూలంగా మారుతాయి. దీనివల్ల సమయస్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మనకు వచ్చే అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోగలుగుతాం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 6, 2025

95% కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో

image

95% నెట్‌వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించినట్లు ఇండిగో తెలిపింది. నిన్న 700కు పైగా సర్వీసులు అందుబాటులో ఉంచగలిగామని ఈరోజు మొత్తంలో 1500 ఫ్లైట్లను నడుపుతున్నామని శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘138 గమ్యస్థానాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించాం. మా ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. సంక్షోభంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని చెప్పింది.