News March 11, 2025

BNG: దారుణం.. 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 12, 2025

రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొవాలి: కలెక్టర్

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో మీకోసం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పురోగతి, రీ సర్వే, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు.

News March 12, 2025

బీసీ స్టడీ సర్కిల్‌లో ఫ్రీ కోచింగ్.. అప్లై ఇలా

image

TG: BC స్టడీ సర్కిల్‌లో బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో నెల రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిగ్రీ పాసై 26yrsలోపు వయసున్న బీసీలు అర్హులు. మార్చి 15- ఏప్రిల్ 8 వరకు https://studycircle.cgg.gov.in/లో అప్లై చేయాలి. APR 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ప్రైవేట్ బ్యాంక్‌లలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఫోన్: 040-29303130.

News March 12, 2025

VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ అద‌న‌పు స‌హాయం

image

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న -గ్రామీణ్‌, అర్బ‌న్, పీఎం జ‌న్‌మ‌న్‌ ప‌థ‌కాల కింద గ‌తంలో మంజూరై నిర్మాణం మ‌ధ్య‌లో నిలిచిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని ప్ర‌క‌టించింద‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ వెల్ల‌డించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అద‌నంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని అందిస్తుందన్నారు.

error: Content is protected !!