News June 14, 2024

BNG: పదోన్నతుల ద్వారా HMల పోస్టుల భర్తీ

image

యాదాద్రి భువనగిరి జిల్లాలోని 83 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యాయి. పదోన్నతులు ఉత్తర్వులు పొందిన 83 మందిలో 82 మంది గురువారం విధుల్లో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు విధుల్లో చేరలేదు. జిల్లాలోని 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి లభించగా ఇందులో 53 మంది ఎస్ఏలకు జిల్లా పరిధిలోనే పోస్టింగులు దక్కాయి.

Similar News

News November 23, 2025

డీసీసీ దక్కకపోవడంపై మోహన్ రెడ్డి అసంతృప్తి

image

నల్లగొండ జిల్లా డీసీసీ దక్కకపోవడంపై గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయన్నారు. నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావని వాపోయారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నిబద్ధతతో పని చేశానన్నారు.

News November 23, 2025

జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు

image

నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్ సైట్ dme.tealngana.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.

News November 23, 2025

నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

image

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.