News February 15, 2025
BNGR: ‘పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేయాలి’

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల జాబితాలను అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జడ్పీ సీఈవో శోభారాణితో కలిసి ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 997 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News November 28, 2025
సిరిసిల్ల: ఇంటర్వ్యూ కావాలని పిలిచి.. హతమార్చి..!

పీపుల్స్ వార్ పార్టీ మాజీ నక్సలైట్ బల్లెపు నరసయ్య అలియాస్ సిద్ధయ్య(బాపురెడ్డి) <<18408780>>హత్య<<>> ఘటనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాను దళంలో ఉన్నప్పుడు చంపినవారి వివరాలను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో, బాధిత కుటుంబానికి చెందిన జక్కుల సంతోశ్ తనకు ఇంటర్వ్యూ కావాలని సిద్ధయ్యను అగ్రహారం గుట్టల వద్దకు రప్పించి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 28, 2025
మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.
News November 28, 2025
సత్యసాయి: బాలుడిని చంపింది ఇలా.!

NP కుంటలో హర్షవర్ధన్(4)ను మేనమామ<<18400825>> ప్రసాద్ హత్య చేసిన విషయం <<>>తెలిసిందే. బుధవారం బాలుడిని అంగన్వాడీ నుంచి ఇంటికి పిలిపించుకుని బైక్పై తోటలోని బావ వద్దకు తీసుకెళ్లి పలకరించి ఇంచికి వచ్చాడు. చెల్లెలు చంద్రకళ, మేనకోడలితో మాట్లాడి బాలుడికి రూ.20 ఇచ్చి అంగడికి పంపాడు. తర్వాత వెళ్తున్నానని చెల్లితో చెప్పి ఆడుకుంటున్న బాబును బైక్పై ఎక్కించుకుని గౌకనపేట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు.


