News February 11, 2025
BNGR: యథాతథంగా భాగ్యనగర్ రైలు

భువనగిరి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి ఈ నెల 15 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. కాగా రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News November 20, 2025
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.
News November 20, 2025
చిన్నారుల ఆరోగ్యం పూర్తిగా స్థిరం: కలెక్టర్

పాములపాడు(M) మిట్టకందాల 3వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం సాయంత్రం 8 మంది చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో వైద్య చికిత్సలు అందించామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో వారందరినీ హాస్పిటల్ నుంచి తమతమ ఇళ్లకు పంపామన్నారు. అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసే ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, ల్యాబ్ పరీక్షలకు పంపించామన్నారు. రిపోర్టులు అందాల్సి ఉందన్నారు.
News November 20, 2025
చిన్నారుల ఆరోగ్యం పూర్తిగా స్థిరం: కలెక్టర్

పాములపాడు(M) మిట్టకందాల 3వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం సాయంత్రం 8 మంది చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో వైద్య చికిత్సలు అందించామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో వారందరినీ హాస్పిటల్ నుంచి తమతమ ఇళ్లకు పంపామన్నారు. అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసే ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, ల్యాబ్ పరీక్షలకు పంపించామన్నారు. రిపోర్టులు అందాల్సి ఉందన్నారు.


