News February 11, 2025
BNGR: యథాతథంగా భాగ్యనగర్ రైలు

భువనగిరి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి ఈ నెల 15 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. కాగా రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News November 21, 2025
రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్

TG: ఫార్ములా ఈ-రేసు <<18337628>>కేసులో<<>> CM రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని KTR అన్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో ఏమీ లేదని రేవంత్కూ తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమే’ అని మీడియా చిట్చాట్లో స్పష్టం చేశారు. MLA దానం నాగేందర్తో రాజీనామా చేయించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, GHMC ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.
News November 21, 2025
SBI పేరిట వెబ్సైట్.. పైరసీ సినిమాలు ప్రత్యక్షం!

ఎస్బీఐ ఇన్సూరెన్స్ పేరుతో ఉన్న పోర్టల్లో పైరసీ సినిమాల లింకులు కనిపించడం కలకలం రేపింది. sbiterminsurance.com పేరిట ఓ పైరసీ వెబ్సైట్ వెలుగుచూసింది. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్&రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్ట్ అయి సినిమాలు ప్లే అవుతున్నాయి. దీనిపై SBI టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 21, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్కు సామాన్యులకూ ఛాన్స్?

వచ్చేనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్ను ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. 100 ఎకరాల్లో సదస్సు నిర్వహిస్తారు. వందలాది స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. 1,300 కంపెనీలు పాల్గొనే అవకాశముంది. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చూసే సౌకర్యం కల్పించినట్లు సమాచారం.


