News February 11, 2025

BNGR: యథాతథంగా భాగ్యనగర్ రైలు

image

భువనగిరి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి ఈ నెల 15 వరకు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. కాగా రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News November 16, 2025

HYD: వేగం ప్రాణాలు తీస్తోంది! జర పైలం

image

HYDలో అతివేగం కారణంగా ప్రాణ నష్టం పెరుగుతోంది. 2023- 2025 అక్టోబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 34% కేసులు అధిక వేగమే ప్రధాన కారణంగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేగం నియంత్రణ కోల్పోవడం, ఢీ కొనడం, ఆలస్యమైన సహాయం వంటి కారణాలతో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు స్పష్టంచేశారు.

News November 16, 2025

HYD: జనాభా కోటికి చేరినా.. పెరగని మానిటరింగ్ స్టేషన్లు

image

గ్రేటర్‌లో జనాభా వేగంగా పెరుగుతున్న కొద్దీ గాలి కాలుష్యం కూడా తీవ్రమవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పనిచేస్తున్న గాలి నాణ్యత పరిశీలన స్టేషన్లు పరిమితంగా ఉండటంతో సరైన రికార్డులు రావటం లేదు. నగర జనాభా దాదాపు కోటికి చేరిన నేపథ్యంలో మరిన్ని మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం అత్యవసరమని పలు నివేదకలు హెచ్చరిస్తున్నాయి.

News November 16, 2025

కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు.!

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల CI శ్రీనివాసులను రైల్వే కోడూరుకు, రైల్వే కోడూరు CI హేమసుందర్ రావును పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఒంటిమిట్ట CI బాబును అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు‌ VRలో ఉన్న నరసింహరాజు ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ CI జావేద్ కడప జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేశ్ రెడ్డి రానున్నారు.