News February 15, 2025
BNGR: ‘పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేయాలి’

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల జాబితాలను అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జడ్పీ సీఈవో శోభారాణితో కలిసి ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 997 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News November 12, 2025
గుంటూరు రైల్వే, బస్టాండ్లలో భద్రతా తనిఖీలు

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం పోలీసులు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బీడీ టీములు, జాగిల బృందాలు ప్రయాణికుల సామానును, కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. అనుమానిత వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News November 12, 2025
కరీంనగర్: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

సమాజంలో అవినీతి పెద్ద సమస్యగా మారిందని, దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందిని ఉమ్మడి కరీంనగర్ ACB డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. లంచం అడగడం.. లంచం తీసుకోవడం.. లంచం ఇవ్వడం కూడా నేరమన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.
News November 12, 2025
NRPT: ‘ప్రజల ఆశ, అత్యాశే మోసగాళ్ల ఆయుధం’

డబ్బుపై ప్రజలకు ఉండే ఆశ, అత్యాశే సైబర్ మోసగాళ్లకు ఆయుధాలని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసంలో నష్టపోయి బాధపడటం కంటే అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. స్మార్ట్ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు, ఏపీకే ఫైల్స్ను తెరవకుండా ఉండటం మంచిదని సూచించారు. ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.


