News January 23, 2025

BNGR: 23 యూనిట్లు మంజూరు: నరసింహారావు

image

దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు. 50వేల రూపాయలతో 100% రాయితీతో 23 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. 21 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు అర్హులని పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 18, 2025

పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించండి: మంత్రి తుమ్మల

image

ఖమ్మం: జిన్నింగ్‌ మిల్లులు తమ సమ్మెను తక్షణమే విరమించి, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి, తేమ నిబంధనలపై కేంద్రం సమీక్షించి, సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను CCIతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.

News November 18, 2025

పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించండి: మంత్రి తుమ్మల

image

ఖమ్మం: జిన్నింగ్‌ మిల్లులు తమ సమ్మెను తక్షణమే విరమించి, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి, తేమ నిబంధనలపై కేంద్రం సమీక్షించి, సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను CCIతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.

News November 18, 2025

JGTL: PM శ్రీ ల్యాబ్‌ల ఏర్పాటులో జాప్యమెందుకు..?

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.3.54 కోట్లతో మొత్తం 18 ల్యాబ్‌లను మంజూరు చేయగా, ఇప్పటికీ కేవలం 3 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 15 ల్యాబ్‌ల పనులు కొనసాగుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికైనా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు.