News August 23, 2024
BNSS 479 పెండింగ్ కేసులకూ వర్తిస్తుంది: కోర్టుతో కేంద్రం

CRPC 436Aను భర్తీచేసిన BNSS 479.. 2024, జులై 1కి ముందు నమోదైన కేసులకూ వర్తిస్తుందని కోర్టుకు కేంద్రం తెలిపింది. 2021 అక్టోబర్ నుంచి జైళ్లు కిక్కిరిసిపోవడంతో కోర్టు దీనిని సుమోటోగా తీసుకుంది. 479 ప్రకారం నేరానికి పడే శిక్షాకాలంలో మూడో వంతు అనుభవిస్తే తొలిసారి తప్పుచేసిన ఖైదీలకు ఉపశమనం కల్పించొచ్చు. దీంతో అండర్ ట్రయల్స్ దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లను కోర్టు ఆదేశించింది.
Similar News
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.
News December 9, 2025
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.


