News October 25, 2025
టోల్ప్లాజాల వద్ద పాస్ల వివరాలతో బోర్డులు: NHAI

వాహనదారుల్లో అవగాహన, పారదర్శకత కోసం NHAI కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాస్ల వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. 30 రోజుల్లోపు పాస్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పింది. ఈ మేరకు ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఇతర ప్రాంతాల్లో ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో వివరాలను ప్రదర్శించనున్నారు.
Similar News
News October 25, 2025
ఇంజినీరింగ్ అర్హతతో NHIDCLలో 34 పోస్టులు

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. వెబ్సైట్: https://www.nhidcl.com/
News October 25, 2025
ఇంటర్లో ఇంటర్నల్ విధానంతో మరిన్ని సమస్యలు: GJLA

TG: INTERలో 20% ఇంటర్నల్, 80% ఎక్స్టర్నల్ మార్కుల విధానం వల్ల ప్రమాణాలు పడిపోతాయని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ వల్ల ప్రాక్టికల్స్ ప్రహసనంగా మారాయి. ఇంటర్నల్ మార్కుల విధానం పెడితే ఆ సంస్థలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. ప్రమాణాలు మరింత దిగజారుతాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి’ అని సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.
News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాను

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది ప్రస్తుతానికి పోర్ట్బ్లెయిర్కి 420KM, విశాఖకు 990KM, చెన్నైకి 990KM, కాకినాడకు 1000KM దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, ఎల్లుండికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో రాష్ట్ర తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.


