News March 17, 2024
బొబ్బిలి: పురుగు మందు తాగి ఆత్మహత్య

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఎస్.అనిల్ (30) కొన్నేళ్ల కిందట కొత్తపెంటలో బెల్లం ఆడించే పని కోసం తండ్రితో వచ్చాడు. పని పూర్తి కావడంతో ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఆవుని అనిల్ అమ్మేశాడు. తక్కువ ధరకు అమ్మాడని తండ్రి కోప్పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News December 27, 2025
విజయనగరం జిల్లా ప్రజలకు GOOD NEWS

జిల్లాలో NTR భరోసా పింఛన్లను జనవరి 1కు బదులు డిసెంబర్ 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి జిల్లాలో 2,71,697 మంది లబ్ధిదారులకు రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధులు 30న బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సిబ్బంది ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు.
News December 27, 2025
మహిళల రక్షణకు 30 మందితో 5 శక్తి టీమ్స్: VZM SP

మహిళల రక్షణ కోసం జిల్లాలో 30 మందితో ఐదు ‘శక్తి టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తారని, మఫ్టీలో విధులు నిర్వహిస్తూ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. శక్తి యాప్పై అవగాహన, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
News December 27, 2025
మహిళల రక్షణకు 30 మందితో 5 శక్తి టీమ్స్: VZM SP

మహిళల రక్షణ కోసం జిల్లాలో 30 మందితో ఐదు ‘శక్తి టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తారని, మఫ్టీలో విధులు నిర్వహిస్తూ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. శక్తి యాప్పై అవగాహన, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.


