News March 17, 2024

బొబ్బిలి: పురుగు మందు తాగి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఎస్.అనిల్ (30) కొన్నేళ్ల కిందట కొత్తపెంటలో బెల్లం ఆడించే పని కోసం తండ్రితో వచ్చాడు. పని పూర్తి కావడంతో ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఆవుని అనిల్ అమ్మేశాడు. తక్కువ ధరకు అమ్మాడని తండ్రి కోప్పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. 

Similar News

News February 2, 2026

పలు కేసుల్లో నిందితుడిపై PD యాక్ట్: VZM SP

image

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మజ్జి కృష్ణవర్ధన్ (చెర్రీ)పై జిల్లా పోలీసు శాఖ PD యాక్ట్ ప్రయోగించింది. నిందితుడిని ముందస్తు నిర్బంధంలో భాగంగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని SP దామోదర్ ఆదివారం తెలిపారు. గత ఐదేళ్లలో విజయనగరానికి చెందిన చెర్రీపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో 8, మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

News February 2, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News February 1, 2026

VZM: ఆప్యాయంగా పలకరించుకున్న బొత్స, పతివాడ

image

మండలి విపక్ష నేత బొత్స సత్యన్నారాయణ, టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ఆదివారం పూసపాటిరేగలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. బొత్స భుజంపై పతివాడ చేయి వేసి స్నేహపూర్వకంగా పలకరించారు. కాసేపు సరదాగా ముచ్చటించుకుంటూ పరస్పర ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. రాష్ట్రమంతా రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన జిల్లాలో మాత్రం రాజకీయాలు హుందాగా సాగుతున్నాయి.