News March 17, 2024
బొబ్బిలి: పురుగు మందు తాగి ఆత్మహత్య

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఎస్.అనిల్ (30) కొన్నేళ్ల కిందట కొత్తపెంటలో బెల్లం ఆడించే పని కోసం తండ్రితో వచ్చాడు. పని పూర్తి కావడంతో ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఆవుని అనిల్ అమ్మేశాడు. తక్కువ ధరకు అమ్మాడని తండ్రి కోప్పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News February 6, 2026
VZM: ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ పర్యటన

ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు విజయనగరం చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పత్రికా సమావేశం, 2:30లకు NDA నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి విశాఖకు వెళ్తారని జిల్లా సమాచార శాఖ గురువారం తెలిపింది.
News February 6, 2026
పదో తరగతి పబ్లిక్ ఫీజు కట్టని వారికి మరో అవకాశం

పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు కట్టని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని
చీపురుపల్లి స్థానిక ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి గురువారం తెలియజేశారు. తత్కాల్ స్కీం ద్వారా అపరాధ రుసుం రూ.1000లు చెల్లించి నామినల్ రోల్స్లో ఈనెల 6 నుంచి 12 దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫీజును www//bse.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి CFMS బ్యాంక్ చలానా ద్వారా చెల్లించాలని సూచించారు.
News February 6, 2026
ఈ నెల 7న షెడ్యూల్డ్ నాయకుల నుంచి వినతుల స్వీకరణ

AP షెడ్యూల్డ్ కులాల కమిషన్ మెంబర్ రావాడ సీతారాం ఈ నెల 7న విజయనగరం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో షెడ్యూల్డ్ కుల నాయకుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం చీపురుపల్లి, రాజాం ప్రాంతాలను సందర్శించనున్నారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు గురువారం వివరాలె వెల్లడించాయి.


