News March 15, 2025

పాక్‌లోని పంజాబ్‌లో బాలీవుడ్ పాటలపై బ్యాన్

image

బాలీవుడ్ పాటలపై పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నమెంట్ నిషేధం విధించింది. ఈ పాటలను పాడడం, వినడం, డాన్స్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రావిన్స్‌లోని అన్ని కాలేజీలు, విద్యాసంస్థల్లో ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. దీనిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పాకిస్థాన్‌కు చెందిన ఎక్కువమంది యువత బాలీవుడ్ సాంగ్స్‌కు డాన్స్ చేస్తారనే విషయం తెలిసిందే.

Similar News

News March 5, 2026

హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

image

HYDలోని<> CCMB<<>> 3 Sr. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది . అర్హతగల వారు మార్చి 17న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG(నేచురల్ సైన్స్), BE/BTech, MBBS, ఫార్మసీ, PhD(బయోఇన్ఫర్మాటిక్స్/ జెనిటిక్స్/ లైఫ్ సైన్స్), డిగ్రీ(మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ, మాలిక్యులార్ బయాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. సైట్: www.ccmb.res.in

News March 5, 2026

రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.

News March 5, 2026

‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

image

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.