News October 23, 2024
బాంబు బెదిరింపు కాల్స్.. ఏవియేషన్ రంగానికి రూ.600 కోట్ల నష్టం!

విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఏవియేషన్ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. సాధారణంగా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్కు అంతరాయం కలిగితే రూ.3.5Cr వరకు నష్టం కలగొచ్చని అంచనా. 9 రోజుల్లో దేశంలోని 170 విమానాలకు బాంబ్ థ్రెట్ కాల్స్ వచ్చాయి. దీంతో సుమారు రూ.600Cr నష్టం వాటిల్లినట్లు విమానయాన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు బాంబు బెదిరింపు కాల్స్కు అడ్డుకట్ట వేయడం కేంద్రానికి సవాల్గా మారింది.
Similar News
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.
News December 10, 2025
దారిద్ర్యాన్ని తొలగించే గణపతి స్తోత్రం

సకల కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని మనం విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేస్తుంటాం. అలాగే ‘సువర్ణ వర్ణ సుందరం’ అంటూ మొదలయ్యే ‘దారిద్ర్య దహన గణపతి స్తోత్రం’ పఠిస్తే దారిద్ర్యం తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడి అనుగ్రహం కోసం భక్తి, శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని తప్పక పఠించాలని సూచిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు, ఎలా పఠించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


