News October 3, 2025
తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్!

AP: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. పలుచోట్ల RDX బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట వచ్చిన వీటిపై అధికారులు అలర్టయ్యారు. తిరుపతి, శ్రీకాళహస్తి, అలిపిరి, తిరుచానూరులో భద్రతా విభాగాలు సోదాలు చేపట్టాయి. 2024 అక్టోబర్లో కూడా ఇవే రకమైన మెయిల్స్ రాగా అధికారుల తనిఖీల్లో బూటకపు బెదిరింపుగా తేలింది.
Similar News
News October 3, 2025
భారీ వర్షాలకు నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

AP: వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ₹4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని CM చంద్రబాబు ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. వరదలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మరింత వరద పోటెత్తుతోందని వారు తెలిపారు. వానలతో నలుగురు మృతి చెందారన్నారు. పంట నష్టంపై నివేదికలివ్వాలని సూచించారు.
News October 3, 2025
నేను పార్టీ మారడం లేదు: పొన్నాల

TG: తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. అదంతా అసత్య ప్రచారమేనని, బీఆర్ఎస్ను వీడేది లేదని Way2Newsకు తెలిపారు. పొన్నాలకు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందని, దీంతో ఆయన మళ్లీ హస్తం గూటికి చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొన్నాల కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలో చేరారు.
News October 3, 2025
కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.
<<-se>>#RABBIT<<>>