News October 19, 2024
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!
ఢిల్లీ నుంచి లండన్కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్కు బయల్దేరుతుందని తెలిపింది.
Similar News
News October 19, 2024
మెక్సికన్ ఇన్వెస్టర్లకు సీతారామన్ ఆహ్వానం
భారత్లో పెట్టుబడులు పెట్టాలని మెక్సికన్ ఇన్వెస్టర్లను FM నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు. GIFT-IFSCలో ఫారిన్ యూనివర్సిటీల సెటప్, GICCs, ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్, షిప్ లీజింగ్లో అవకాశాలను అన్వేషించాలని సూచించారు. ఆర్థిక సంబంధాలు, ఫార్మా సూటికల్స్, మెడ్ టెక్, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో గ్రోత్ను 2 దేశాల ప్రైవేటు సెక్టార్ లీడర్లు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కొన్ని కంపెనీలతో MoUలు కుదిరాయన్నారు.
News October 19, 2024
యువతి MBBS చదువుకు కేటీఆర్ భరోసా
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచి మనసు చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద దళిత యువతి సుస్మిత MBBS చదువుకు భరోసానిచ్చారు. ఆమె కల్వకుర్తి గురుకులంలో చదివి, ఉస్మానియా కాలేజీలో MBSS సీటు సాధించి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా ఆయన స్పందించారు. తాను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.
News October 19, 2024
తక్కువ ధరలకే వంటనూనెలు: మంత్రి నాదెండ్ల
AP: రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరలకే వంట నూనెలను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామాయిల్ లీటర్ రూ.110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124కే ఇస్తామని చెప్పారు. అలాగే తక్కువ ధరకే కందిపప్పు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలో వంటనూనెల దిగుమతిదారులతో మంత్రి భేటీ అయ్యారు. మరింత ఎక్కువగా వంటనూనెలను అందుబాటులో ఉంచాలని వారిని ఆదేశించారు.