News October 26, 2024

తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపులు

image

AP: తిరుపతిలోని ఏడు హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ హోటళ్లను తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో విస్తృత సోదాలు నిర్వహించారు. మెయిల్స్ ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా నిన్న కూడా తిరుమలలోని రెండు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News March 18, 2025

ఏడుగురు MLCల పదవీకాలం ముగింపు

image

AP: శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రఘువర్మ పదవీ కాలం ముగియడంతో మండలి వారికి ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకముందు వీరు సీఎంతో జరిగిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అనంతరం మండలిని ఛైర్మన్ మోషేన్ రాజు రేపటికి వాయిదా వేశారు.

News March 18, 2025

విజయ్‌పై అన్నామలై ఫైర్.. సినిమా సెట్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడంటూ..

image

తమిళ హీరో, TVK అధినేత విజయ్‌పై TN BJP చీఫ్ అన్నామలై మండిపడ్డారు. ‘సినిమాల్లో డ్రింక్, స్మోక్ చేసే నీకు మద్యం కుంభకోణం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇంట్లో నుంచి రాజకీయాలు చేయడం కాదు. గ్రౌండ్ లెవెల్‌‌కి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. సినిమా సెట్స్‌లో సిగరెట్, మద్యం తాగుతూ హీరోయిన్ల నడుము తాకుతూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడు. నేను అతనిలా కాదు. క్షేత్ర స్థాయిలో పోరాడుతున్నా’ అని కామెంట్స్ చేశారు.

News March 18, 2025

50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

image

AP: పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై YCP MLCలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ₹4వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం ₹వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే మేం రాగానే ₹1,000 పెంచాం. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నాం’ అని తెలిపారు.

error: Content is protected !!