News August 30, 2024
MBBS సీటు సాధించిన బోండా తెగ యువకుడు

ఒడిశాలోని బోండా తెగకు చెందిన మంగళ ముదులి (19) నీట్లో అర్హత సాధించి బెర్హంపూర్లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి(MKCG) మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారు. బోండా తెగ నుంచి డాక్టర్ కాబోతున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. ఆయన నీట్ కోచింగ్ కోసం ఓ టీచర్ ఆర్థిక సాయం చేశారు. ముదులి కుటుంబం అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. తమ తెగకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని ముదులి తెలిపారు.
Similar News
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.
News November 27, 2025
వైట్ ఎగ్స్కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

ఉత్తర్ప్రదేశ్లోని మురాదాబాద్లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.


