News October 7, 2024
సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు అందజేత

TG: ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్ చెక్కులను ప్రజా భవన్లో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొంగులేటి వారికి అందజేశారు. రూ.796కోట్ల విలువైన చెక్కులను ఇవ్వగా ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల బోనస్ అందింది. సింగరేణిలోని ఒప్పంద ఉద్యోగులకు రూ.5వేల బోనస్ ఇస్తామని భట్టి అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు కట్టాల్సిన అవసరం ఉందని పొంగులేటి అన్నారు.
Similar News
News December 8, 2025
మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

* ఫ్రిజ్ కంపార్ట్మెంట్ టెంపరేచర్ను 4°C, ఫ్రీజర్ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్లైట్కు దూరంగా ఫ్రిజ్ను ఉంచండి.
News December 8, 2025
ఇంటర్వ్యూతో BELలో పోస్టులు

HYD-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 8, 2025
T20WC.. ‘స్ట్రీమింగ్’ నుంచి తప్పుకున్న జియోహాట్స్టార్!

వచ్చే ఏడాది T20WC స్ట్రీమింగ్ బాధ్యతల నుంచి జియో హాట్స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.


