News September 25, 2024
అక్టోబర్ 9న సింగరేణి కార్మికుల బోనస్ పంపిణీ

TG: సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటాను ప్రభుత్వం దసరా బోనస్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని అక్టోబర్ 9న చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సింగరేణి CMD ఎన్.బలరామ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రూ.796 కోట్ల లాభాలను GOVT బోనస్గా చెల్లించనుంది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది లబ్ధి పొందనున్నారు. సగటున ఒక్కొక్కరు రూ.1.90 లక్షల చొప్పున పొందే అవకాశముంది.
Similar News
News January 28, 2026
నేడు వైజాగ్లో 4th టీ20.. జట్టులో మార్పులు?

భారత్, న్యూజిలాండ్ మధ్య 4th T20 మ్యాచ్ నేడు వైజాగ్ వేదికగా జరగనుంది. సిరీస్ను IND ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచులో ప్రయోగాలు చేయొచ్చు. హార్దిక్, హర్షిత్కు రెస్ట్ ఇచ్చి అక్షర్, అర్ష్దీప్ను ఆడించే అవకాశముంది. తొలి 3 మ్యాచుల్లో ఫెయిలైన శాంసన్ ఈరోజు రాణిస్తారా? శ్రేయస్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
LIVE: 7PM నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో.
News January 28, 2026
మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News January 28, 2026
కలుపు తీయనివాడు కోత కోయడు

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.


