News November 29, 2024
ఎకరాకు రూ.12 వేల బోనస్.. తృప్తిని ఇస్తోంది: సీఎం రేవంత్

TG: సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు ₹500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని CM రేవంత్ తెలిపారు. ‘ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు ₹10వేల నుంచి ₹12వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘రైతన్నలకు ఎకరాకు ₹12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తోంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
ఇండియాలో భద్రతపై నమ్మకముంది: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ PM నెతన్యాహు DECలో జరగాల్సిన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ బాంబు పేలుడే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ PMO దీనిపై స్పందించింది. ‘ఇజ్రాయెల్-ఇండియాతో పాటు ప్రధానులు నెతన్యాహు, మోదీల బంధం చాలా బలమైనది. PM మోదీ నాయకత్వంలోని భారత్లో భద్రతపై మా ప్రధానికి పూర్తి నమ్మకముంది. ఇప్పటికే కొత్త డేట్స్ కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని ట్వీట్ చేసింది.
News November 26, 2025
ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.
News November 26, 2025
ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.


