News November 22, 2024
బోనస్ మాట బోగస్ అయింది: హరీశ్ రావు

TG: ఈనాం కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట బోగస్ అయిందని ఖమ్మం పత్తి మార్కెట్లో ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతుల సమస్యలపై సమీక్ష చేసే తీరిక లేదన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధర లేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.
Similar News
News December 1, 2025
ధాన్యం కొనుగోళ్లు.. రూ.2,300 కోట్లు జమ చేేశాం: నాదెండ్ల

AP: రాష్ట్రంలో ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.2,300 కోట్ల నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలకు సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, టార్పాలిన్లు ఉచితంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
News December 1, 2025
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత

తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహమాడినట్లు స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించారు. ఇవాళ్టి డేట్, లవ్ ఎమోజీలతో పెళ్లి ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవ ఆలయంలో తొలుత నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉపాసన కొణిదెల, అనుపమతో పాటు తదితర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<


