News December 4, 2024

జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్

image

AP: పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్‌లో బుక్ ఫెస్టివల్ జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్, తెలుగు, జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలకు చెందిన దాదాపు 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఆరుద్ర, దాశరధి, నాజర్, నార్ల చిరంజీవి, ఎన్.నటరాజన్, భానుమతి శతజయంతి వేడుకలను పుస్తక ప్రదర్శనలో నిర్వహించనున్నారు.

Similar News

News October 16, 2025

ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారు: రాహుల్

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు PM మోదీ భయపడుతున్నారని INC నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అందుకే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయదని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించినా ప్రధాని స్పందించడం లేదన్నారు. ‘ఈజిప్టులో జరిగిన పీస్ సమ్మిట్‌కు డుమ్మా కొట్టారు. ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. Op సిందూర్‌కు విరుద్ధంగా మాట్లాడినా ఊరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.

News October 16, 2025

డిప్లొమా, ఐటీఐ అర్హతతో 186 పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)186 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు NOV 4 వరకు అప్లై చేసుకోవచ్చు.10 పోస్టులకు మాత్రం NOV 5 లాస్ట్ డేట్. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://bel-india.in/

News October 16, 2025

ఆంధ్రా వంటకాలే కాదు.. పెట్టుబడులూ స్పైసీ: లోకేశ్

image

AP: విశాఖతో పాటు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రా వంటకాలు స్పైసీ అంటారు. మా పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయి. కొంతమంది పొరుగువారు ఇప్పటికే ఆ మంట అనుభవిస్తున్నారు’ అని పేర్కొన్నారు. రెండ్రోజుల కిందట విశాఖలో గిగా వాట్ కెపాసిటీతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.