News May 20, 2024
బ్యాంకింగ్ రంగంలో జోరు.. ప్రధాని మోదీ హర్షం

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో బ్యాంకింగ్ రంగం రికార్డ్ స్థాయిలో రూ.3లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయాయని, UPA సర్కార్ ఫోన్ బ్యాంకింగ్ పాలసీనే ఇందుకు కారణమని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులు రూ.1.78లక్షల కోట్లు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.1.41 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.
Similar News
News October 3, 2025
మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్లు?

భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లను 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికే 1GB ప్లాన్లను తొలగించారు. సరసమైన ప్లాన్లు కనిపించట్లేదు. డేటా ప్లాన్లను బలవంతంగా రుద్దుతున్నారు. ధరలు భారీగా పెరిగాయి. అయినా TRAI స్పందించట్లేదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మీ కామెంట్?
News October 3, 2025
శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.
News October 3, 2025
అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. స్పందించిన సనా మిర్

WWCలో భాగంగా PAK, BAN మ్యాచ్ సందర్భంగా పాక్ కామెంటేటర్ సనా మిర్ చేసిన <<17897473>>అజాద్ కశ్మీర్<<>> వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. రాజకీయ కోణంలో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్లేయర్ నటాలియా పడిన కష్టాలను చెప్పే క్రమంలో ఆ పదాన్ని వాడినట్లు వివరించారు. అనుకోకుండా వాడిన పదానికి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని తెలిపారు.