News August 6, 2024
విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్

TG: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇలా జ్వరమేదైనా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పేషెంట్లతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చేపట్టిన ఫీవర్ సర్వేలోనూ జ్వరాల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.
Similar News
News December 28, 2025
వరంగల్: రేపటి నుంచే ‘యూరియా యాప్’ అమలు

వరంగల్ జిల్లాలో యూరియా పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా యూరియా యాప్ను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఉన్న రైతులు గూగుల్ ప్లే స్టోర్లో ‘Fertilizer Booking App’ అని టైప్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యూరియా సరఫరాలో జాప్యాన్ని నివారించొచ్చని ఆమె పేర్కొన్నారు.
News December 28, 2025
ప్రముఖ ఫ్రెంచ్ నటి కన్నుమూత

ప్రముఖ ఫ్రెంచ్ నటి బ్రిగిట్టే బార్డోట్(91) మరణించారు. నటి, మోడల్, సింగర్గా ఆమెకు గుర్తింపు ఉంది. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సదరన్ ఫ్రాన్స్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతనెల అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె వృద్ధాప్య సమస్యలతోనే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News December 28, 2025
పని గంటలు కాదు.. శ్రద్ధ ముఖ్యం: ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే ఎంత శ్రద్ధగా పనిచేశామనేది ముఖ్యమని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎస్డీ శిబులాల్ అన్నారు. ‘పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్కు టైమ్ కేటాయించేందుకు ప్రతి ఒక్కరికీ ఛాన్స్ ఉంటుంది. కేటాయించిన టైమ్లో 100% ఫోకస్డ్గా ఉండాలి. సమయపాలనలో ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్లు వారికి ఉంటాయి’ అని చెప్పారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.


