News August 6, 2024

విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్

image

TG: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇలా జ్వరమేదైనా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పేషెంట్లతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చేపట్టిన ఫీవర్ సర్వేలోనూ జ్వరాల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.

Similar News

News January 14, 2026

డీడీపీ పెంపే లక్ష్యంగా స్వర్ణాంధ్ర@2047: కలెక్టర్

image

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (డీడీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని స్వర్ణాంధ్ర@2047 జిల్లా విజన్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ప్రతీ విభాగంలో కనీసం 15 శాతం పురోగతి సాధించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.

News January 14, 2026

ధనుర్మాసం: చివరి రోజు కీర్తన

image

పాలసముద్రం మధించి అమృతాన్నిచ్చిన ఆ నారాయణుడిని, గోదాదేవి గోపికల రూపంలో ఆరాధించి ‘తిరుప్పావై’ అందించారు. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆ తల్లి రచించిన ఈ ముప్పది పాశురాలను భక్తితో అనుసంధించేవారికి శ్రీమన్నారాయణుడి సాటిలేని దివ్యకృప లభిస్తుంది. ఈ పాశురాలను పఠించేవారు సంసార బంధాల నుంచి విముక్తులై, ఆ శ్రీహరి అనుగ్రహంతో బ్రహ్మానందాన్ని పొందుతారని గోదాదేవి మనకు ఉపదేశించారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 14, 2026

ధనుర్మాసం: చివరి రోజు కీర్తన

image

పాలసముద్రం మధించి అమృతాన్నిచ్చిన ఆ నారాయణుడిని, గోదాదేవి గోపికల రూపంలో ఆరాధించి ‘తిరుప్పావై’ అందించారు. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆ తల్లి రచించిన ఈ ముప్పది పాశురాలను భక్తితో అనుసంధించేవారికి శ్రీమన్నారాయణుడి సాటిలేని దివ్యకృప లభిస్తుంది. ఈ పాశురాలను పఠించేవారు సంసార బంధాల నుంచి విముక్తులై, ఆ శ్రీహరి అనుగ్రహంతో బ్రహ్మానందాన్ని పొందుతారని గోదాదేవి మనకు ఉపదేశించారు. <<-se>>#DHANURMASAM<<>>