News October 10, 2024

వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా

image

బంగ్లాతో టీ20 సిరీస్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శాంసన్ అవకాశాల్ని వృథా చేసుకుంటున్నారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉందని గుర్తు చేశారు. ‘వారికి విలువైన 2 ఛాన్సులు అయిపోయాయి. తమ వికెట్‌ను పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు చూడాలి. సౌతాఫ్రికా టూర్‌కి జైస్వాల్, గిల్, రుతురాజ్ రెడీగా ఉంటారు. ఇషాన్ కిషాన్ కూడా రేసులోకి రావొచ్చు’ అని అంచనా వేశారు.

Similar News

News October 10, 2024

ఈ విషయంలో ప్రపంచ దేశాల కంటే భారత్ ఉత్తమం

image

భారత ఆహార వినియోగ విధానాలు ఉత్త‌మ‌మ‌ని WWF లివింగ్ ప్లానెట్ నివేదిక పేర్కొంది. ప్ర‌పంచ దేశాలు ఈ విధానాల‌ను అనుస‌రిస్తే 2050 నాటికి ఆహార ఉత్ప‌త్తి కోసం త‌క్కువ స్థాయిలో భూమి వాతావ‌ర‌ణం దెబ్బతింటుందని పేర్కొంది. త‌ద్వారా ఒక‌టికంటే త‌క్కువ భూభాగంలోనే మాన‌వాళికి అవ‌స‌ర‌మైన ఆహారాన్ని ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ంది. అర్జెంటీనా, AUS, US, బ్రెజిల్ దేశాల ఆహార వినియోగ ప‌ద్ధతుల‌ను నివేదిక ఆక్షేపించింది.

News October 10, 2024

వారంలో రూ.7,500 కోట్ల డ్రగ్స్ సీజ్

image

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కార్యకలాపాలపై స్పెషల్ సెల్ ఉక్కుపాదం మోపుతోంది. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కేజీల కొకైన్‌ను సీజ్ చేసింది. ఇటీవల 560 కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఇవాళ 200 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేసింది.

News October 10, 2024

ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపు రాత్రి 7 గంటలతో ముగియనుంది. షాపులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. అమెరికా నుంచి అత్యధికంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా నిన్నటి వరకు 57 వేల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చింది.