News May 20, 2024

వారిద్దరికీ పాకిస్థాన్‌లోనే మద్దతు ఎక్కువ: అమిత్ షా

image

విపక్ష నేతలు కేజ్రీవాల్, రాహుల్ గాంధీకి భారత్‌లో కన్నా పాకిస్థాన్‌లోనే మద్దతు దారులు ఎక్కువని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే కేజ్రీవాల్ అవినీతి కేసులోనే అరెస్టయ్యారని విమర్శించారు. జైలుకు వెళ్లినప్పటికీ సీఎం పదవిని వీడని సిగ్గులేని వ్యక్తి కేజ్రీవాల్ అని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనిపించకుండా పోతుందని అన్నారు.

Similar News

News January 27, 2026

త్వరలో ATMలలో చిన్న నోట్లు.. ఛేంజ్ కూడా తీసుకోవచ్చు!

image

₹10, 20, 50 వంటి చిన్న నోట్ల చెలామణీ పెంచేందుకు కొత్త ATMలను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ₹500, ₹100తోపాటు చిన్న నోట్లు విత్ డ్రా చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు Mint తెలిపింది. ముంబైలో పరీక్షిస్తున్నారని, ఆమోదం వస్తే దేశమంతటా అమలు చేస్తారని సమాచారం. ATMలో ఛేంజ్ తీసుకునే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మన దగ్గర ఉన్న ₹500 నోటును అందులో ఉంచి, ఐదు ₹100 నోట్లను తీసుకోవచ్చు.

News January 27, 2026

రేపు JEE మెయిన్… ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

రేపు, ఎల్లుండి JEE మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 15L మంది వరకు వీటికి హాజరుకానున్నారు. ఉ.9-12 వరకు ఫస్ట్ సెషన్, మ.3-6 వరకు రెండో సెషన్ ఉంటుంది. APలో 30, TGలో 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. కాగా అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఒరిజినల్ స్కూల్ ఐడీ లేదా ఇతర ఫొటో IDని తీసుకెళ్లాలి. NTA నిషేధిత వస్తువుల్ని తీసుకుపోరాదు.

News January 27, 2026

‘మల దానం’తో యువకుడికి ₹3.4 లక్షల ఆదాయం.. దాంతో ఏం చేస్తారు?

image

కెనడాకు చెందిన ఓ యువకుడు తన ‘మల దానం’ ద్వారా 2025లో ₹3.4 లక్షలు సంపాదించారు. వింతగా ఉన్నా ఇది Faecal Microbiota Transplantation చికిత్సకు చాలా కీలకం. ఆరోగ్యవంతుడైన దాత మలంలోని మంచి బ్యాక్టీరియాను సేకరించి Clostridioides difficile అనే ఇన్ఫెక్షన్‌తో బాధపడే రోగుల పేగుల్లోకి ఎక్కిస్తారు. తద్వారా వారి జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేస్తారు. ఈ యువకుడి దానం వల్ల 400 మంది ప్రాణాలు దక్కాయి.