News February 2, 2025
వారిద్దరు రాజీనామా చేయాలి: టీపీసీసీ చీఫ్

TG: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో తమతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు.
Similar News
News January 17, 2026
మరోసారి ముంబైని చిత్తు చేసిన యూపీ

WPL-2026: ముంబైపై మరోసారి యూపీ వారియర్స్ సత్తా చాటింది. ఇవాళ 22 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత యూపీ 187/8 రన్స్ చేయగా.. ముంబై 165 పరుగులకే పరిమితమైంది. యూపీ కెప్టెన్ లానింగ్ 45 బంతుల్లో 70 రన్స్తో రాణించారు. కాగా జనవరి 15న కూడా ముంబైపై యూపీ గెలిచిన సంగతి తెలిసిందే.
News January 17, 2026
JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు రిలీజ్

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగినై అధికారిక <
News January 17, 2026
పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.


