News April 4, 2025

ST సర్టిఫికెట్ జారీకి పేరెంట్స్ ఇద్దరూ ట్రైబల్స్ కానక్కర్లేదు: కలకత్తా HC

image

పేరెంట్స్‌లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో పిల్లలకు ST సర్టిఫికెట్ నిరాకరించడం తగదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తల్లి ట్రైబల్ కాగా తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తని అధికారులు అర్జీని తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24గంటల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.

Similar News

News April 10, 2025

IPL: ఒకే ఓవర్లో 30 రన్స్

image

IPL: ఢిల్లీతో మ్యాచులో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించారు. మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 24 రన్స్ చేశారు. ఆ ఓవర్లో వరుసగా 6,4,4,4NB,6,1,4(లెగ్ బై) రావడంతో 30 రన్స్ వచ్చాయి. సాల్ట్ 17 బంతుల్లో 37 రన్స్ చేసి రనౌటయ్యారు. విరాట్ (22), పడిక్కల్ (1) కూడా వెనుదిరిగారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 7 ఓవర్లలో 74/3గా ఉంది.

News April 10, 2025

ఈ ఐదు ఆహారాలను వేడి చేసి తినకండి!

image

ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్‌తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT

News April 10, 2025

రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

image

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్‌లో CM రేవంత్ ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.

error: Content is protected !!