News August 28, 2024
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం

AP: హైకోర్టు శాశ్వత <<13912324>>న్యాయమూర్తులుగా<<>> జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపారు.
Similar News
News January 25, 2026
హృతిక్ రోషన్కు ఏమైంది?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిన్న చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ హుడీ, క్యాప్ ధరించిన ఆయన.. నడవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు.
News January 25, 2026
కోహ్లీకి ఆ సత్తా ఉందని సచిన్ చెప్పారు: రాజీవ్ శుక్లా

తన రికార్డులను కోహ్లీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని సచిన్ గతంలో తనతో చెప్పినట్లు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గుర్తు చేసుకున్నారు. ‘ఓ రోజు నేను సచిన్ ఇంటికి లంచ్కు వెళ్లాను. క్రికెట్లో మీరు చాలా రికార్డులు సృష్టించారని, వాటిని ఎవరు బ్రేక్ చేయగలరని సచిన్ను అడిగా. కోహ్లీకి ఆ సత్తా ఉందన్నారు’ అని రాజీవ్ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో సచిన్ 100 సెంచరీలు చేయగా, కోహ్లీ ఇప్పటి వరకు 85 శతకాలు బాదారు.
News January 25, 2026
FDDIలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని ఫుట్వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (<


