News August 22, 2024
మండలి ప్రతిపక్ష నేతగా బొత్స.. ఛైర్మన్కు జగన్ లేఖ

AP: శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. ఈ మేరకు మండలి ఛైర్మన్కు లేఖ రాశారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా లేళ్ల అప్పిరెడ్డిని నియమిస్తున్నట్లు శాసనమండలి సెక్రటరీ జనరల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పిరెడ్డి అంతకు ముందు మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వైసీపీ బొత్సను నియమించింది.
Similar News
News December 3, 2025
ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
News December 3, 2025
NCSSRలో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ (<


