News April 19, 2025

ఆ బాధను అబ్బాయిలు భరించలేరు: జాన్వీ కపూర్

image

మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అబ్బాయిలు క్షణం కూడా భరించలేరని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. కానీ కొంతమంది పురుషులు ఈ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి సమయంలో మహిళలు మానసిక క్షోభ అనుభవిస్తారని చెప్పారు. అలాంటి సమయంలో వారు ఓదార్పు కోరుకుంటారని తెలిపారు. కాగా జాన్వీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ మూవీలో నటిస్తున్నారు.

Similar News

News January 20, 2026

ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ: కేటీఆర్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో చేస్తుంది సిట్ విచారణ కాదని చిట్టి విచారణ అని కేటీఆర్ విమర్శలు చేశారు. ఇదో లొట్ట పీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలను విచారణ, కమిషన్ల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడుతున్నారన్నారు. నైనీ బ్లాక్ రద్దు వెనక వాటాల పంచాయితీ ఉందని ఫైరయ్యారు.

News January 20, 2026

ALL TIME RECORD: ఒక్క రోజులో RTCకి రూ.27.68 కోట్ల ఆదాయం

image

AP: సంక్రాంతి పండగ వేళ APSRTC రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలో ఒక్కరోజులో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. జనవరి 19న రూ.27.68 కోట్ల రాబడిని సాధించింది. ఆ రోజు మొత్తం 50.60 లక్షల మందిని గమ్యాలకు చేర్చింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చింది. డ్రైవర్లు, కండక్టర్లు ఇతర సిబ్బందికి ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందనలు తెలిపారు.

News January 20, 2026

సంతానోత్పత్తికి సీడ్ సైక్లింగ్‌

image

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలు వంటి విత్తనాలను ఒక ప్రత్యేకమైన విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుంది.