News July 10, 2024
సీఎంతో భేటీ కానున్న BPCL ప్రతినిధులు

AP: మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన BPCL ప్రతినిధులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రూ.60వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ కోసం 2-3వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
Similar News
News January 7, 2026
ఉగ్ర దోస్తీ.. పాక్లో చేతులు కలిపిన హమాస్, లష్కరే!

పాక్ అడ్డాగా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ ముమ్మరమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా హమాస్ కమాండర్ నాజీ జహీర్, లష్కరే తోయిబా కీలక నేత రషీద్ అలీ సంధూతో గుజ్రాన్వాలాలో కలవడం సంచలనం సృష్టిస్తోంది. గతంలోనూ జహీర్ PoKలో పర్యటించి భారత వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొన్నాడు. అమెరికా నిషేధించిన ఈ రెండు గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పాక్ సైన్యం అండ ఉన్నట్లు సమాచారం.
News January 7, 2026
పెళ్లి గురించి అభిమాని ప్రశ్న.. శ్రద్ధాకపూర్ సమాధానమిదే!

రచయిత రాహుల్ మోడీతో డేటింగ్ వార్తల నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ జువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్లో భాగంగా ఇన్స్టాలో ఫ్యాన్స్తో ముచ్చటించారు. ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘చేసుకుంటా.. నేను కూడా పెళ్లి చేసుకుంటా’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ‘పెళ్లి ఎప్పుడు మేడమ్’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News January 7, 2026
RRC నార్తర్న్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

<


