News March 12, 2025

BPL:తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి సూసైడ్: SI

image

ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి మరణించినట్లు తాళ్లగురజాల SIరమేశ్ తెలిపారు. SIకథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన మనోజ్ కుమార్(18)అనే సీనియర్ ఇంటర్ విద్యార్థి పరీక్షలకు సిద్ధం కాకుండా ఫోన్‌లో ఆటలాడుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడని తండ్రి తెలుపాడని SI వివరించారు.

Similar News

News November 23, 2025

చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

image

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్‌లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.

News November 23, 2025

రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

image

<<18323509>>ఎన్‌కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.

News November 23, 2025

పుత్తూరు: హత్య చేసిన నిందితుడి అరెస్ట్

image

పుత్తూరు మండలం గొల్లపల్లి వద్ద ఈనెల 19వ తేదీన హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా కేశవరాజుకుప్పానికి చెందిన రవి(40)ని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసైనా రవి రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు పరిసర ప్రాంతాలలో చెత్త, కాగితాలు ఏరుతూ ఉండేవాడు. తినడానికి డబ్బు ఇవ్వలేదని తన సంచిలోని కత్తి తీసి రామ్మూర్తిని పొడిచాడు.