News March 12, 2025

BPL:తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి సూసైడ్: SI

image

ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి మరణించినట్లు తాళ్లగురజాల SIరమేశ్ తెలిపారు. SIకథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన మనోజ్ కుమార్(18)అనే సీనియర్ ఇంటర్ విద్యార్థి పరీక్షలకు సిద్ధం కాకుండా ఫోన్‌లో ఆటలాడుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడని తండ్రి తెలుపాడని SI వివరించారు.

Similar News

News March 12, 2025

ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్

image

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ AIIMSలో చేరిన ఆయన తాజాగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు.

News March 12, 2025

నిలిచిన SBI సేవలు.. ఇబ్బందిపడ్డ యూజర్లు

image

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI సేవలు నిన్న సాయంత్రం 4 గంటల పాటు నిలిచిపోయాయి. బ్యాంక్ యూపీఐ చెల్లింపులు జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లడించారు. అయితే సాంకేతిక కారణాలతో ఈ ఇబ్బంది తలెత్తిందని, తర్వాత సమస్యను పరిష్కరించినట్లు SBI పేర్కొంది. కాగా దేశంలో నిత్యం 39.3 కోట్ల యూపీఐ ట్రాన్స‌ాక్షన్లు జరుగుతున్నాయి.

News March 12, 2025

NGKL: మహిళ ఆత్మహత్య.. వ్యక్తి అరెస్ట్.!

image

అచ్చంపేట పట్టణంలో ఈనెల 6న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఆవుల లక్ష్మి (37) కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతురాలి తండ్రి మేకల నిరంజన్ ఫిర్యాదు మేరకు పట్టణానికి చెందిన బుద్దుల పర్వతాలు అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అచ్చంపేట కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు.

error: Content is protected !!