News April 11, 2024

BPL: రెండు బైకులు ఢీ .. ఒకరి మృతి

image

బనగానపల్లె పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. చాగలమర్రి మండల కేంద్రానికి చెందిన జమాల్ బాషా(27) పని నిమిత్తం బైక్‌పై బనగానపల్లెకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో, ఎదురుగా వస్తున్న బైక్ ఈయన్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో జమాల్ బాషా అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

Similar News

News April 19, 2025

శ్రీనగర్ SSPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ SSPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ SSPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

కర్నూలు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే రక్షణ

image

సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. ప్రజలు వారి విలువైన సమాచారం నష్టపోడానికి, మోసపోవడానికి ప్రధానంగా అత్యాశ, అశ్రద్ధ కారణాలని సూచించారు. మోసానికి గురైనవారు వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అప్రమత్తతే రక్షణని ఆయన హెచ్చరించారు.

News April 19, 2025

శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!