News October 22, 2025

BPT-2848 వరి పోషకాలను ఇలా అందించాలని ప్లాన్

image

బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో యాంతోసైనిన్ అనే పదార్థం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ పొరలో జింక్, ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. BPT-2848లో ఈ పోషకాల శాతం చాలా ఎక్కువ. అందుకే ఈ రైస్ పౌడర్‌ను పిల్లలకు బేబీ ఫుడ్‌లా అందించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఉప్మారవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, సేమియా రూపంలోనూ ఈ రకాన్ని అందించాలని బాపట్ల వరి పరిశోధనాస్థానం ఇప్పటికే నిర్ణయించింది.

Similar News

News October 22, 2025

UPI ధమాకా.. రోజూ ₹94 వేల కోట్ల చెల్లింపులు

image

పండుగ సీజన్‌లో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ నెలలో రోజూ సగటున రూ.94 వేల కోట్ల లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలిపింది. ఈ నెలలో ఇంకా వారం రోజులకు పైనే ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో డిజిటల్ పేమెంట్స్‌లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.

News October 22, 2025

లిక్విడ్ లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలంటే..

image

ముఖానికి మరింత సౌందర్యం అద్దడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వేసుకుంటారు. అయితే ప్రస్తుతం లిక్విడ్ లిప్‌స్టిక్‌ ట్రెండ్ అవుతోంది. దీన్ని సరిగా వాడకపోతే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ముందు లిప్‌లైనర్‌తో పెదాల చుట్టూ లైనింగ్ చేయండి. తర్వాత లిక్విడ్ లిప్‌‌స్టిక్‌ను అప్లై చేసి ఆరనివ్వాలి. లిప్‌స్టిక్ మరీ ఎక్కువగా ఉందనిపిస్తే ఓ టిష్యూతో పెదాలను అద్దాలి. ఇలా చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.

News October 22, 2025

ట్రాన్స్‌కో, జెన్‌కోలో మరో 6 నెలల పాటు సమ్మెలపై నిషేధం

image

AP: రాష్ట్ర పవర్ కార్పొరేషన్లలో మరో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్‌కో పరిధిలోని మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో, జెన్‌కోలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వివరించింది. కాగా ఇంతకు ముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు వర్తించేలా సమ్మె నిషేధ జీవో ఇచ్చింది. తాజాగా గడువు పొడిగించింది.