News October 30, 2024
TTD ఛైర్మన్గా బీఆర్ నాయుడు

AP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా బీఆర్ నాయుడును ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలక మండలిని నియమించింది. కాగా బీఆర్ నాయుడు ఓ మీడియా ఛానల్ అధినేత. జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, నన్నూరి నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్ర యెల్లా, మల్లెల రాజశేఖర్ గౌడ్, ఆనంద్ సాయి, వేముల ప్రశాంతి, పనబాక లక్ష్మి, జస్టిస్ హెచ్ఎల్ దత్, ఆర్ఎన్ దర్శన్, బొంగునూరు మహేందర్లను మెంబర్లుగా ప్రకటించింది.
Similar News
News November 5, 2025
రేపే బిహార్ తొలిదశ పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 18 జిల్లాల పరిధిలోని 121 సెగ్మెంట్లలో రేపు పోలింగుకు ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ దశలో 8 మంది మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు, JJL పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఈ నెల 11న మరో 122 స్థానాల్లో పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.
News November 5, 2025
చర్మ పీహెచ్ను కాపాడుతున్నారా?

ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల చర్మం దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్ ఫిల్మ్ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. pH బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్స్, సన్స్క్రీన్ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.
News November 5, 2025
నేవీ చిల్డ్రన్ స్కూల్లో ఉద్యోగాలు

విశాఖలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 18 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, బాల్వాటిక టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ncsvizagnsb.nesnavy.in/


