News June 21, 2024
శ్రీవారికి సమర్పించిన బ్రాండెడ్ వాచ్లు ఈ వేలం: TTD
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఈ వేలం వేయనున్నట్లు TTD బోర్డు తెలిపింది. ఈనెల 24న రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో ఈ-వేలం వేయనున్నట్లు చెప్పింది. టైటాన్, CASIO, VIVO, OPPO, నోకియాతో పాటు మరికొన్ని బ్రాండ్లకు చెందిన వాచ్లు, ఫోన్లు ఉన్నట్లు వెల్లడించింది. వివరాలకు <
Similar News
News October 8, 2024
ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే..
ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా కేంద్రం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్ అందిస్తోంది. ఇందుకోసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ఫామ్ నింపి, రేషన్, ఆధార్, అడ్రస్, ఫొటోలు సమర్పించాలి. లేదంటే https://pmuy.gov.in/లోకి వెళ్లి Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు.
News October 8, 2024
ISS రష్యన్ సెగ్మెంట్ నుంచి ఎయిర్ లీకేజీ
అంతరిక్ష కేంద్రం (ISS)లోని రష్యన్ విభాగంలో గాలి లీక్ అవుతుండడంపై నాసా ఆందోళన వ్యక్తం చేసింది. జ్వెజ్డా మాడ్యూల్ PrK వెస్టిబ్యూల్లో 2019లో మొదటిసారిగా లీకేజీని గుర్తించారు. ఏప్రిల్ 2024 నాటికి రోజుకు 1.7 కేజీల గాలి లీకేజీ పెరిగినట్టు తేలింది. దీని వల్ల వ్యోమగాముల నివాస అనుకూల పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, లీకేజీ నియంత్రణలో కొంత పురోగతి సాధిస్తున్నట్లు నాసా తెలిపింది.
News October 8, 2024
డిసెంబర్ నుంచి అమరావతి పనులు: సీఎం చంద్రబాబు
AP: డిసెంబర్ నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభం అవుతాయని CM చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ వంటి పలు అంశాలను ప్రధాని మోదీకి వివరించానని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రోడ్లు, రైల్వే లైన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్లు పేర్కొన్నారు.