News October 11, 2025
స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. మెనూ ఇదే?

TG: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ‘బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ అమలు చేస్తామని CM రేవంత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కూళ్లు రీఓపెన్ అయ్యే రోజు (జూన్ 12) నుంచే విద్యార్థులకు అల్పాహారం అందించే అవకాశం ఉంది. ఇప్పటికే మెనూ ఖరారైనట్లు తెలుస్తోంది. 3 రోజులు రైస్ ఐటమ్స్ (పొంగల్, కిచిడీ, జీరారైస్), 2 రోజులు రవ్వ ఐటమ్స్ (గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ), ఒక రోజు బోండా ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 11, 2025
సీఐతో వాగ్వాదం.. పేర్ని నానిపై కేసు

AP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి PSలో కేసు నమోదైంది. నిన్న మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. కాగా ఓ కేసులో వైసీపీ నేత సుబ్బన్నను విచారణకు పిలవడంతో వివాదం రాజుకుంది. పేర్ని నాని వచ్చి సీఐతో <<17968702>>వాగ్వాదానికి<<>> దిగారు.
News October 11, 2025
యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 5 యంగ్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 22లోపు అప్లై చేసుకోగలరు. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21నుంచి 35ఏళ్లు. నెలకు రూ.40వేలు జీతంగా చెల్లిస్తారు. వెబ్సైట్: https://ssc.gov.in/
News October 11, 2025
పాలపిట్టలు ఎక్కడికి పోయాయి?

పల్లెల్లో కనిపించే అందమైన పక్షి పాలపిట్ట. ఈ పిట్ట చెట్ల కొమ్మలపై కూర్చొని కనిపిస్తే కళ్లకు ఎంతో హాయిగా ఉండేది. పొలాల్లో, రోడ్ల పక్కన ఇవి ఎగురుతూ కనిపించేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. మొన్న దసరాకి పాలపిట్టను చూడాలని పొలాలన్నీ తిరిగినా కనిపించలేదు. చాలా బాధ అనిపించింది. పంటకు వాడే రసాయనాలు, పొలం గట్లమీద చెట్లను నరికేస్తుండటంతో అవి కూడా మనకు దూరమయ్యాయి. మీరు ఈ మధ్య పాలపిట్టను చూశారా? కామెంట్ చేయండి