News March 21, 2025
స్కూళ్లలో అల్పాహారం పథకం పెట్టాలి: KTR

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR డిమాండ్ చేశారు. ‘తమిళనాడులో ఈ స్కీమ్ను అమలు చేయడం వల్ల ఆస్పత్రిలో చేరే పిల్లల సంఖ్య 63.2% తగ్గింది. తీవ్ర అనారోగ్య సమస్యలు 70.6% తగ్గాయి. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడింది. ఈ ఫలితాలను చూసి BRS ప్రభుత్వం ఈ స్కీమ్ను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 18, 2025
514 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 20 – JAN 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, CA/CFA/CMA-ICWA, MBA/PGDBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850. SC, ST, PwBDలకు రూ.175. వెబ్సైట్: bankofindia.bank.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 18, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<
News December 18, 2025
క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ను భూమిలో వేయాలి.


