News September 25, 2024
BREAKING: ఆపరేషన్ మూసీ.. అక్రమ నిర్మాణాల గుర్తింపు

మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.
Similar News
News November 17, 2025
HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News November 17, 2025
HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.


