News August 4, 2024

BREAKING: ఉదయాన్నే కామారెడ్డి డిపో బస్సుకు ప్రమాదం

image

తూప్రాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి డిపోకి చెందిన బస్సు మరో బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సును రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మెకానిక్‌లకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవే-44పై వాహనాలు నిలిచాయి.

Similar News

News December 10, 2025

NZB: తొలి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే..?

image

తొలి విడతలో GP ఎన్నికలు జరిగే బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, వర్ని, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 2,61,210 మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందులో మహిళలు 1,37,413 మంది మహిళలు, పురుషులు 1,23,790, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 11 మండలాల్లో 1,653 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

News December 10, 2025

నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ముచ్చట్లు

image

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు. గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం మొదలైంది.

News December 10, 2025

NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.