News January 17, 2025
BREAKING: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాలకుర్తి వద్ద లారీ టైర్ పేలి కారుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
టైరు పేలి టాటా ఏస్ బోల్తా

వెల్దుర్తి మండల సమీపంలోని అల్లుగుండు పెట్రోల్ బంక్ దగ్గర నేషనల్ హైవేపై మంగళవారం టైరు పేలి టాటా ఏస్ బోల్తా పడింది. కర్నూలు మార్కెట్కు వేరుశనగ కాయలు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్తో సహా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News February 18, 2025
కర్నూలు జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే కర్నూలులో ఆదివారం, సోమవారం వరుసగా 38.2, 38°C ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
News February 18, 2025
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

కర్నూలులోని 4వ పట్టణ పోలీసు స్టేషన్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.