News March 1, 2025

BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.

Similar News

News December 17, 2025

పెద్దపల్లి: పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి డీసీపీ భద్రతా సూచనలు

image

ఓదెల, సుల్తానాబాద్, పెద్దపల్లి, ఎలిగేడు మండలాల్లో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆవాంఛనీయ సంఘటనలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేందుకు సిబ్బందికి సూచనలు చేశారు. ప్రత్యేక బృందాలు, పెట్రోలింగ్ వాహనాలు శాంతి భద్రతను పర్యవేక్షిస్తున్నమన్నారు.

News December 17, 2025

రబీ సీజన్.. అందుబాటులో 2 లక్షల మె.టన్నుల యూరియా

image

AP: రబీ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించింది. ప్రతి జిల్లాలో 21 రోజులకు సరిపడా యూరియాను బఫర్ స్టాకుగా ఉంచుకోవాలని, 2 రోజులకు ఒకసారి యూరియా నిల్వలపై మీడియాకు సమాచారం అందించాలని, రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు.

News December 17, 2025

NGKL: ముగిసిన మూడో విడత పోలింగ్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, చారకొండ, బల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, లింగాల మండలాల్లోని 158 గ్రామాల్లో మూడో విడత స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ సిబ్బంది గేట్లను మూసివేశారు. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.