News February 8, 2025
BREAKING: కామారెడ్డి జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం

KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News December 6, 2025
ఫిట్నెట్ సాధించిన గిల్.. టీ20లకు లైన్ క్లియర్!

IND టెస్ట్&ODI కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. అతడికి BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 9 నుంచి SAతో జరిగే T20 సిరీస్కు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నాయి. SAతో తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టు, ODIలకు గిల్ దూరమయ్యారు. ఫిట్నెస్ ఆధారంగా గిల్ <<18459762>>T20ల్లో<<>> ఆడతారని BCCI పేర్కొన్న సంగతి తెలిసిందే.
News December 6, 2025
సిరిసిల్ల: స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరపాలి: ఇన్ఛార్జ్ కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆమె జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్తో కలిసి హాజరై మాట్లాడారు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 6, 2025
పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను సిద్దిపేటలో కలెక్టర్ కె. హైమావతి, అబ్జర్వర్ హరితల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో కంప్యూటరైజ్డ్ విధానంలో ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓల కేటాయింపు జరిగింది. రెండో విడతలో 1973 మంది పీఓలు, 2436 మంది ఏపీఓలు విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.


